లంక పర్యటన ముగిసిన 48 గంటలకే..


భారత క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ పరీక్షలు

బెంగళూరు: టీమ్‌ఇండియా ప్రధాన ఆటగాళ్లు.. శ్రీలంక పర్యటనను ముగించుకుని స్వదేశానికి రాగానే వారికి బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఈఓ)లో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సహా బీసీసీఐతో సెంట్రల్‌ కాంట్రాక్టులున్న ఆటగాళ్లందరూ ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. లంకతో రెండో టెస్టు గురువారం ముగియగా.. శనివారం ఆటగాళ్లు సీఈవోలో పరీక్షలకు హాజరయ్యారు. వీరితో పాటు లంక పర్యటనకు వెళ్లని కాంట్రాక్టు ఆటగాళ్లూ పరీక్షల్లో పాల్గొన్నారు. భారత జట్టు స్వదేశీ సీజన్‌ త్వరలో మొదలు కానుంది. శుభ్‌మన్‌ సేన న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆపై ఆస్ట్రేలియాతో అయిదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇవి కాక పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఉన్నాయి. ఆపై ఐపీఎల్‌ ఆడాల్సి ఉంటుంది. ఇలా ఎనిమిది నెలల పాటు భారత క్రికెటర్లు తీరిక లేకుండా గడపబోతున్నారు. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *